స్థానిక రైతులకు దక్కని ఎరువులు
బూర్గంపాడు మండలంలోని స్థానిక రైతులకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉంచాల్సిన సొసైటీలు, ప్రైవేటు దుకాణాల్లో "స్టాక్ నిల్వలు లేవు" అనే బోర్డులు దర్శనమిస్తున్నాయి. కానీ, అదే సమయంలో నల్లబజారులో మాత్రం ఎంత డబ్బు పెడితే అంత యూరియా లభిస్తుండటం గమనార్హం. పక్క మండలాల నుంచి వచ్చే రైతులకు సైతం ఇక్కడ అధిక ధరలకు ఎరువులు లభిస్తున్నాయి
నిమ్మకు నీరెత్తినట్లు వ్యవసాయ శాఖ :
పక్కా ప్రణాళికతో జరుగుతున్న ఈ నల్లబజారు దందాపై అధికారులు మాత్రం కన్నుమూసి వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బహిరంగ మార్కెట్లోనే నిబంధనలు ఉల్లంఘించి అధిక ధరలకు విక్రయిస్తున్నా, వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టకపోవడంపై రైతాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అధికారుల అలసత్వమే వ్యాపారులకు చుట్టరికంగా మారిందనే ఆరోపణలు వినవస్తున్నాయి.
రైతాంగం డిమాండ్ :
పంటల దిగుబడిపై ప్రభావం పడకముందే జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి బూర్గంపాడు మండలంలో ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. నల్లబజారుకు తెరదించి, అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, రైతులకు సరిపడా యూరియాను మద్దతు ధరకే అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు.


0 Comments