ట్రాన్స్ఫార్మర్లను చల్లబరిచేందుకు భద్రాచలం డిఈ జీవన్ కుమార్ అధ్యక్షతన చర్యలు తీసుకుంటున్నారు . అందులో భాగంగా ఎర్తింగ్ పైపులకు నీళ్లు పట్టిన విద్యుత్ సిబ్బంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో అధిక ఉష్ణోగ్రత నమోదవుతున్నందున ఎండలను తట్టుకోలేక ప్రజలు అధికంగా విద్యుత్తును వాడుతున్నారు.
ట్రాన్స్ఫార్మర్ల మీద లోడ్ పడుతూ అధిక వేడికి గురి అవుతుందని దీంతో ట్రాన్స్ఫార్మర్ కి అధిక లోడ్ పడే అవకాశం ఉన్నందున విద్యుత్ అంతరాయములు కలగకుండా హెచ్చుతగ్గు సమస్యలు రాకుండా చూసుకుంటూ విద్యుత్ అధికారులు కార్మికులు అహర్నిశలు మండుటెండను సైతం లెక్కచేయకుండా నిరంతరం శ్రమిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఏడిఈ నరసింహారావు, ఏఈ రాజారావు , ఉపేందర్, వెంకట్ రాజు, రామకృష్ణ, ఉదయ్, శ్రీను, త్రినాద్ రెడ్డి, జగదీష్ పాల్గొన్నారు.


0 Comments