ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ G.జనార్ధన్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ G.గణేష్ ,ES K.తిరుపతి గార్ల ఆదేశాల మేరకు ఖమ్మం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ CI CH.శ్రీనివాస్ మరియు సిబ్బంది కలిసి RTA ఆఫీసు భద్రాచలం వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా వస్తున్న ఒక కార్(TG 08 HQ 9088) ను ఆపి తనిఖీ చేయగా దానిలో 15.070 kg ల ఎండు గంజాయి లభ్యమైంది. ఇట్టి గంజాయి ని A1) రఘు విష్ణోయి S/O గోవర్ధన్ R/O జీడిమెట్ల, రంగారెడ్డి (జిల్లా),A2) శేఖర్ రామ్ S/O పోకర్ రామ్ R/O జోధ్ పూర్ ,రాజస్థాన్ లు ఒడిశా రాష్టం లోని మల్కాన్ గిరి నుండి హైదరాబాద్ కు తరలిస్తూ పట్టుబడినారు. తదుపరి విచారణ నిమిత్తం ఇట్టి గంజాయిని,1 కార్ ,2 సెల్ ఫోన్లు మరియు ఇద్దరు ముద్దాయిలను ( వీటి మొత్తం విలువ రూ.10,73,500) భద్రాచలం ఎక్సైజ్ స్టేషన్ లో అప్పగించడమైనది.. ఈ తనిఖీలలో కానిస్టేబుల్స్ సుధీర్, వెంకట్,హరీశ్,విజయ్ వీరబాబు,ఉపేందర్ లు పాల్గొన్నారు.
*నోట్* : ఏదైనా గంజాయి కి సంబంధించిన సమాచారం ఉన్నచో టోల్ ఫ్రీ నెంబర్ 18004252523 కు సమాచారం అందించగలరని, మీ వివరాలు గోప్యం గా ఉంచబడతాయి అని CI గారు తెలియజేశారు..

0 Comments