తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర ఆరవ మహాసభలు హైదరాబాదులోని బాగ్లింగంపల్లిలో ని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ది. 29.12.25,మరియు 30.12.2025 రెండు రోజులు రాష్ట్ర మహాసభలు జరిగిన అనంతరం రాష్ట్ర మహాసభలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు ఈ ఎన్నికలలో భద్రాచలం డివిజన్ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ అధ్యక్షులు బంధు వెంకటేశ్వరరావును తెలంగాణ రాష్ట్ర ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా బంధు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నాకు ఇచ్చిన ఈ పదవికి న్యాయం చేస్తానని నన్ను నమ్మి ఈ పదవి ఇచ్చిన రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కార్యవర్గానికి నా కృతజ్ఞతలను తెలుపుకుంటూ పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా కృషి చేస్తానని ఒక ప్రకటనలో తెలియజేశారు

0 Comments