![]() |
| ఆల్ పెన్షనర్స్ కార్యాలయం భద్రాచలం |
ది 18. 01.2025 శనివారం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ భద్రాచలం డివిజన్ కార్యాలయం లో (భద్రాచలంలోని పాత ఎల్ఐసి ఆఫీస్ ఎదురుగా) వరంగల్ శరత్ మాక్స్ విజన్ కంటి ఆసుపత్రి వైద్యులచే ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తారు. ఈ కంటి పరీక్షలలో కేటరాక్టు కలిగినటువంటి వారిని వరంగల్ ఆసుపత్రి వారి సొంత వాహనములలో వరంగల్ ఆసుపత్రికి తీసుకువెళ్లి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేస్తారు అంతేకాక వారికి ఉచిత మందులు, ఉచిత భోజన వసతి సౌకర్యము కల్పిస్తారు కావున ఈ శిబిరమునకు వచ్చినప్పుడు తప్పనిసరిగా హెల్త్ కార్డు తీసుకుని రావాల్సిందిగా ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ భద్రాచలం డివిజన్ అధ్యక్షుడు బంధు వెంకటేశ్వరరావు. ప్రధాన కార్యదర్శి కె ఎస్ ఎల్ వి ప్రసాద్. కోశాధికారి డి కృష్ణమూర్తి తెలియపరిచారు. కావున రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు ఉపాధ్యాయులు ఉద్యోగులు హెల్త్ కార్డు కలిగిన పోలీసులు. జర్నలిస్టులు మరియు హెల్త్ కార్డు పై ఆధారపడిన వారి కుటుంబ సభ్యులు కూడా (హెల్త్ కార్డు కలిగిన) అర్హులే. మరియు ఉచిత పరీక్షలకు మాత్రమే తెల్ల రేషన్ కార్డు కలిగిన వారు అర్హులు అని తెలిపిన అధ్యక్షులు బందు వెంకటేశ్వరరావు

0 Comments