ఖమ్మం, మార్చి 12, బిసిఎం10 న్యూస్.
స్థానిక చర్చ్ కాంపౌండ్ సెంటర్ గాంధి పార్క్ గ్రంధాలయ ఆవరణలో బుధవారం నాడు 'డా కేర్ హోమియోపతి' ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపును నిర్వహించారు. ఈ క్యాంపులో సుమారు వంద మందికి పైగా పార్క్, గ్రంధాలయం విజిటర్స్ కి, చుట్టుపక్కల వ్యాపారస్తులకు ఫ్రీగా బిపి, షుగర్ మొదలగు పరీక్షలు చేసి ఉచితంగా హోమియోపతి మందులు పంపిణీ చేశారు. అనంతరం డాక్టర్ షేక్ అష్రఫ్ఉద్దీన్ మాట్లాడుతూ డా కేర్ సంస్థ సిఎండి డా ఏఎం రెడ్డి సహకారంతో పట్టణ వ్యాప్తంగా ఉచితంగా క్యాంప్ లు నిర్వహిస్తూ వైద్యం అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. మా హోమియోపతి మందుల ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు చక్కటి పరిస్కారం లభిస్తుందన్నారు. ఈ క్యాంప్ ఏర్పాటు లో సహకరించిన గ్రంధాలయ సిబ్బందికి డా కేర్ తరుపున ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. వారితో పాటు క్యాంపు లో ఖమ్మం బ్రాంచ్ పిఆర్ఓ సిహెచ్ వెంకటేశ్వర్లు, ఫార్మాసిస్ట్ ఆషా కుమారి, సుజాత తదితరులు పాల్గొన్నారు.


0 Comments