Breaking News

Loading..

ఈసారి ఆప్ ఆధిపత్యానికి బిజెపి గండి..!!


● లేదు ఆప్ గెలుస్తుంది..!!

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 05, బిసిఎం10 న్యూస్.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారనే అంశం పై ఎగ్జిట్ పోల్ అంచనాలు వెలువడ్డాయి. 70 సీట్లున్న ఢిల్లీ అసెంబ్లీలో అత్యధిక సీట్లు గెలువబోతున్న పార్టీ, ఇతర పార్టీలకు ఎన్ని సీట్లు వస్తాయనే దానిపై ఎగ్జిట్ పోల్ తన అంచనాలను ప్రకటించింది. ఇందులో ఈసారి కేంద్రంలో బిజెపి ఢిల్లీలో ఆప్ ఆధిపత్యానికి గండి కొట్టబోతున్నట్లు తెలిపింది. ఎగ్జిట్ పోల్ ప్రకారం 70 సీట్ల ఢిల్లీ అసెంబ్లీలో బిజెపి ఈసారి ఏకంగా 35 నుంచి 40 సీట్లు దక్కించుకోబోతున్నట్లు తెలిపింది.

అలాగే అధికార ఆప్ కు 32 నుంచి 37 సీట్లు లభించబోతున్నట్లు వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీకి 0 నుంచి 1 సీటు దక్కే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దీంతో గత మూడుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఊపు మీదున్న ఆప్ ఆధిపత్యానికి గండిపడటం ఖాయమని ఎగ్జిట్ పోల్ తేల్చేసింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఆప్, బిజెపి మధ్య గట్టి పోరు సాగింది. ఇరు పార్టీలు విజయం కోసం తీవ్రంగా ప్రయత్నించారు. కేజ్రివాల్ నేతృత్వంలోని ఆప్ వరుసగా నాలుగోసారి డిల్లీలో అధికారం దక్కించుకునేందుకు శ్రమించారు. అయితే కేంద్రంలో మూడో సారి గెలిచినా ఢిల్లీని గెలవలేకపోతున్నారన్న అపప్రదను పోగొట్టుకునేందుకు బిజెపి నేతలు పక్కా వ్యూహాలు రచించారు. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్ అంచనాలు కాషాయ దళంలో ఊపుతెచ్చాయి.

● లేదు ఆప్ గెలుస్తుంది..!!

దిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ అధికారాన్ని చేపడుతుందని కేకే సర్వే అంచనా వేసింది. ఆప్ కు 44,  బిజెపి కూటమి 26 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని తెలిపింది.

ఎగ్జిట్ పోల్స్ అంచనా నిజమైతే దిల్లీలో 27 ఏళ్ల తర్వాత బిజేపి అధికారాన్ని చేపట్టనుంది.

Post a Comment

0 Comments