Breaking News

Loading..

పొలిటిక‌ల్ బాంబులు పేల‌నున్నాయి..!!

పొలిటిక‌ల్ బాంబులు పేల‌నున్నాయి..!!

● ప్ర‌ధాన నాయ‌కుల‌పైన చ‌ర్య‌లు త‌ప్ప‌వు.

● ఆధారాల‌తో సిద్ద‌మవుతున్న ఫైల్స్.

● జాతీయ తెలుగు ఛానెల్ ఇంట‌ర్య్వూలో - తెలంగాణా బిరెవెన్యూ, హౌసింగ్, స‌మాచార శాఖల మంత్రి.

హైద‌రాబాద్, అక్టోబర్ 24, బిసిఎం10 న్యూస్,

దీపావ‌ళి కంటే ముందే


రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, స‌మాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి రాజ‌కీయ సంచ‌ల‌నాలు సృష్టించే పొలిటిక‌ల్ బాంబ్‌ల‌ను పేల్చేశారు. సియోల్‌లో హ‌న్ న‌ది పున‌రుజ్జీవ‌న ప‌రిస్ధితుల‌ను అధ్య‌య‌నం చేయ‌డానికి వెళ్లిన మంత్రి పొంగులేటి అక్క‌డ ఓ తెలుగు జాతీయ ఛాన‌ల్ ప్ర‌తినిధికి ఇచ్చిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఫోన్ ట్యాపింగ్‌, కాళేశ్వ‌రం ప్రాజెక్ట్, ధ‌ర‌ణి వంటి సుమారు 8 నుంచి 10 ప్ర‌ధాన పాయింట్ల‌లో ఈ చ‌ర్య‌లు ఉంటాయ‌న్నారు. దీనికి సంబంధించి ఫైళ్లు పూర్తి సాక్ష్యాధారాల‌తో సిద్ధ‌మ‌య్యాయ‌ని మంత్రి వివ‌రించారు. సియోల్ నుంచి మ‌రో రెండు రోజుల్లో హైద‌రాబాద్ చేరేస‌రిక‌ల్లా చ‌ర్య‌లు ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశాలు ఉన్నాయ‌న్నారు. కేవ‌లం క‌క్ష సాధింపులాగాక పూర్తి ఆధారాల‌తో చ‌ర్య‌లు ఉంటాయ‌ని, ఎంత‌టివారినైనా ఉపేక్షించేది లేద‌న్నారు. తొంద‌ర‌ప‌డి ఎటువంటి ఆధారాలు లేకుండా వెళ్ల‌బోమ‌న్నారు. కాళేశ్వ‌రం ప్రాజెక్ట్‌కు సంబంధించి విచార‌ణ దాదాపు పూర్త‌యిందని మొత్తానికి  ఫోన్ ట్యాపింగ్‌, కాళేశ్వ‌రం ప్రాజెక్ట్, ధ‌ర‌ణి వంటి అంశాలు ట్రాక్‌లో ఉన్నాయ‌ని మంత్రి చెప్పారు. ప్ర‌జ‌లు ఇంత‌వ‌ర‌కు ఎలాంటి చ‌ర్య‌లు లేవ‌ని భావించ‌వ‌ద్ద‌ని, వారు కోరుకునే విధంగా పూర్తి ఆధారాల‌తో ముఖ్యంగా ఫైళ్ల సాయంతో ముందుకు వెళ్ల‌బోతున్నామ‌నే సంచ‌ల‌నానికి మంత్రి తెర‌ తీశారు.

Post a Comment

0 Comments