తిరుపతి లడ్డు ప్రసాదం కల్తీ ఘటనను ఖండిస్తూ 'విశ్వహిందూ పరిషత్' ఆధ్వర్యంలో భారీ ర్యాలీ.
ఖమ్మం, సెప్టెంబర్ 30, బిసిఎం10 న్యూస్.
ఖమ్మం, విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదంలో జరిగిన కల్తీ ఘటనకు జాతీయ స్థాయి ఆందోళన కార్యక్రమాలలో భాగంగా రాష్ట్ర వ్యాప్త నిరసన ప్రదర్శనలకు విశ్వహిందూ (విహెచ్పి) పరిషత్ పిలుపు మేరకు పాత బస్టాండ్ నుండి పాత కలెక్టర్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ ని ప్లే కార్డులతో నిర్వహించారు. తిరుపతి లడ్డు వివాదం పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి, హిందూ దేవాలయాల పై ప్రభుత్వ పెత్తనం వైదొలగాలి, పూజ్య పీఠాధిపతులు, స్వామీజీలు, ఆధ్యాత్మిక సామాజిక వేత్తలతో ధార్మిక పరిషత్ను ఏర్పాటు చేసి దేవాలయ వ్యవస్థను నిర్వహించాలి, దేవాలయాలలో అన్యమత ఉద్యోగస్తులను వెంటనే తొలగించాలి, అన్యాక్రాంతమైన దేవాలయ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలి, దేవాలయ స్థిర చర ఆస్తులను పరిరక్షించాలి, దేవాదాయశాఖను రద్దు చేయాలి, దేవాలయ వాణిజ్య సముదాయాలలో దుకాణాలు హిందువులకే ఇవ్వాలి, తెలంగాణ ప్రభుత్వం దేవాలయాలలో పూజ ప్రసాదాల తయారికి ఉపయోగిస్తున్న వస్తువుల పై అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించాలని కోరుతూ నిరసన ర్యాలీ చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి రాజకీయాలకు అతీతంగా హిందూ బంధువులందరూ హాజరయ్యారు. వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బొడ్ల మల్లికార్జున్, బోనాల రామకృష్ణ, నేరేండ్ల శ్రీనివాస్, పసుమర్తి రవి, వెంకట సత్యనారాయణ యాదవ్, వేముల రాంబాబు, కదవెండి వేణు, శాస్త్రీ, బాలాజీ, లగడపాటి కృష్ణ, రాజు, శ్రీనివాస్, బోడ్ల మల్లికార్జున్, రాము, బాల్వంట్, జయంత్, కోనగంటి నాగమణి, కృష్ణ ప్రియ, లక్ష్మి, పద్మ, రమ, వెంకటేశ్వర స్వామి భక్తులు, అయ్యప్ప భక్తులు, శివ భక్తులు, భజన మండలి సభ్యులు, వినాయక ఉత్సవ నిర్వాహకులు, దేవాలయాల కమిటీల సభ్యులు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.

0 Comments